ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 6, 2021, 2:23 PM IST

ETV Bharat / state

దారుణం: శాడిస్ట్ భర్త... చంపిన భార్య

మద్యం రక్కసి దాహానికి పచ్చని కాపురం బలైంది. మద్యానికి బానిసైన భర్త... రోజూ తాగి వచ్చి భార్యను వేధించే వాడు... భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య... భర్తను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా గోర్లగుట్టలో జరిగింది.

wife kills husband
భర్తను చంపిన భార్య

మద్యం తాగి వచ్చి రోజు వేధిస్తున్న భర్త ప్రవర్తనతో విసిగెత్తిన భార్య... భర్తను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా బేతంచేర్ల మండలం గోర్లగుట్ట గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన ధనలక్ష్మి, వడ్డే చిన్న రామాంజినేయులు భార్యాభర్తలు. రామాంజనేయులు గ్రానైట్ ఫ్యాక్టరీలో పనికి వెళ్తుండగా.. ధనలక్ష్మి కూలి పని చేసేది. మద్యానికి అలవాటు పడ్డ రామాంజనేయులు ప్రతి రోజు.. తాగి వచ్చి భార్యను వేధించేవాడు. భర్త ప్రవర్తనతో విసుగెత్తిన ధనలక్ష్మి... రామంజనేయులు నిద్రిస్తున్న సమయంలో తల, గొంతుపైన గొడ్డలితో నరికి హత్య చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తండ్రి హత్యకు గురవ్వటం... తల్లి కటకటాలపాలవటంతో... వీరి ముగ్గురు పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details