కర్నూలు జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో.. ఓట్లు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. జోహరాపురం పోలింగ్ బూత్లో అనేకమంది పేర్లు జాబితాలో లేకపోవడంతో.. సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు. ఓ ప్రాంతంలోని ఓటర్లకు మరో చోట, ఇతర వార్డుల్లో ఓటు హక్కు కేటాయించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలులో ఓట్లు గల్లంతు... ఎన్నికల సిబ్బందితో ప్రజలు వాగ్వాదం - కర్నూలులో ఎన్నికల సిబ్బందితో ఓటర్ల వాగ్వాదం
ఓ ప్రాంతంలోని ప్రజలకు మరో చోట ఓటుహక్కు కల్పించడం చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా జోహరాపురం పోలింగ్ బూత్లో పలువురి ఓట్లు గల్లంతు కావడంతో.. ఎన్నికల సిబ్బందితో ఓటర్లు గొడవకు దిగుతున్నారు.
జోహరాపురంలో ఓట్లు గల్లంతు