కర్నూలు జిల్లా గడివేముల మండలం ఎల్.కే. తండాలో వాలంటీర్పై దాడి చేశారు నాటు సారా తయారీ దారులు. ఈ నెల 17న తండాలోని నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ తనిఖీల్లో పోలీసుల వెంట వార్డు వాలంటీర్ హనుమంతు నాయక్ కూడా ఉన్నాడు. అతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడని నాటుసారా తయారీదారులు కక్ష పెంచుకున్నారు. శుక్రవారం వారు దాడి చేయటంతో... హనుమంతు నాయక్కు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాటు సారాపై ఫిర్యాదు చేశాడని వాలంటీర్పై దాడి
కర్నూలు జిల్లాలోని ఎల్.కే. తండాలో వాలంటీర్పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. నాటు సారా తయారీపై పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో ఈ దాడికి పాల్పడ్డారు.
![నాటు సారాపై ఫిర్యాదు చేశాడని వాలంటీర్పై దాడి Villagers attack on volunteer and Police registered case in gadivemula kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7687598-614-7687598-1592582723745.jpg)
వాలంటీర్పై గ్రామస్థుల దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు