తమను ఎస్టీల్లో చేర్చాలని వాల్మీకి సంఘం ర్యాలీ - valmiki jayanthi in kurnool district
వాల్మీకి జయంతిని కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని వాల్మీకి సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు.
![తమను ఎస్టీల్లో చేర్చాలని వాల్మీకి సంఘం ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4739342-268-4739342-1570964929011.jpg)
వాల్మీకి జయంతి వేడుకలను కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని వాల్మీకి సంఘం నాయకుల ఆధ్వర్యంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సునయన సమావేశంలో వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ వీర పాండియన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ బి.టి నాయుడు అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకిల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాటసాని అన్నారు. బీసీలకు ప్రత్యేక డిక్లరేషన్తో పాటు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
TAGGED:
valmiki