ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి'

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. వందలాది మంది ఉపాధ్యాయులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

By

Published : Jan 25, 2021, 10:26 AM IST

UTF District Council Meeting
యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. పీఆర్సీని తక్షణం అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాగమణి ప్రభుత్వాన్ని కోరారు.

ఎన్నికల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వందలాది మంది ఉపాధ్యాయులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఫెడరేషన్​ నాయకులు యల్లప్ప, జయరాజు, శాంతిప్రియ, రఫీక్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details