కర్నూల్లో లాక్డౌన్ అమల్లో ఉండగా అనవసరంగా బయట తిరిగే వారిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని కూడళ్లలో వాహనాలపై వెళ్తున్న వారిని ఆపి విచారిస్తున్నారు. సరైనా సమాధానం చెప్పని వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కార్డులతో బయటకు రావాలని పోలీసులు తెలిపారు.