attack: రౌడీషీటర్ పై దాడి...ఆస్పత్రికి తరలింపు - kurnool district latest news
నంద్యాలలో ఓ రౌడీషీటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

దాడి
కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ బార్లో వెంకట సాయి అలియాస్ కొవా అనే రౌడీ షీటర్పై కొంతమంది వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాయిని.. నంద్యాల ప్రభుత్వాస్పత్రికి ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలను పరిశీలించారు. వెంకట సాయి పలు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు.