ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 27, 2020, 11:51 PM IST

ETV Bharat / state

'మండలి రద్దు జగన్ ఏకపక్ష నిర్ణయం'

పెద్దల సభ రద్దు జగన్ ఏకపక్షనిర్ణయమని ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపరంగా పోరాడుతామన్నారు.

ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్
ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్

ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్

జగన్ ఏకపక్ష నిర్ణయంతో శాసన మండలిని రద్దు చేశారని ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్ మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. పెద్దల సభ రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించిన సభను కొడుకు రద్దు చేయటమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపరంగా పోరాడుతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details