ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన సిటీకేబుల్​ వివాదం - City Cable dispute latest news update

సిటీకేబుల్​ వైర్ల మరమ్మతుల విషయంలో వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారికి సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించేశారు. అనంతరం ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

two teams fight on City Cable dispute
ఇరు వర్గాల మధ్య ఘర్షణ

By

Published : Jul 8, 2020, 11:05 PM IST


కర్నూలులో సిటీకేబుల్ వైర్ల మరమ్మతుల విషయంలో చోటు చేసుకున్న వివాదం ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసింది. నగరంలోని ప్రకాష్​నగర్ వద్ద కేబుల్ వైర్లు మరమ్మతులు చేస్తుండగా వ్యవసాయ మార్కెట్ మాజీఛైర్మన్ డీ.వెంకటేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకొని కేబుల్ ప్రసారాలకు అంతరాయం కలిగిస్తున్నారని వారితో వాగ్వాదానికి దిగారు. మరో వర్గానికి చెందిన కే.ఈ కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ ఘటనపై ఇరు వర్గాలపై రెండో పట్టణ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details