ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రథోత్సవంలో విద్యుదాఘాతం.. ఇద్దరు వ్యక్తులు మృతి - అరికెరలో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెరలో నిర్వహించిన రంగనాథస్వామి దేవాలయం రథోత్సవం.. విషాదంగా ముగిసింది. జాతరలో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు.

Two persons were electrocuted in Arikera in Aluru zone of Kurnool district
రథోత్సవ జాతరలో విద్యుదాఘాతం... ఇద్దరు మృతి...

By

Published : Mar 13, 2021, 7:15 AM IST

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర రంగనాథస్వామి దేవాలయం రథోత్సవ జాతరలో విషాదం జరిగింది. వేడుకలో తేరు లాగుతుండగా విద్యుదాఘాతానికి గురై.. శివ (25), లక్ష్మన్న (28) మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు.

విషయం తెలుసుకున్న మంత్రి జయరాం.. బాధిత కుటుంబీకులను పరామర్శించారు. లక్ష రూపాయల చొప్పున స్వయంగా సాయం అందించారు. ప్రభుత్వం నుంచి వైఎస్సార్ బీమాను.. బాధితులకు అందేలా చూస్తామన్నారు. ప్రమాదానికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖ అధికారులే వహించాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details