ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 10, 2023, 2:15 PM IST

ETV Bharat / state

మద్యం.. అతి వేగం.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం

Two People Died in the Accident: అతి వేగానికి తోడు.. మద్యం మత్తులో వాహనం నడపటంతో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కర్నూలు జిల్లాలో స్కూటర్‌పై వస్తున్న ఇద్దరు యువకులు కారును బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

bike accident in kurnool
రోడ్డు ప్రమాదం

Two People Died in the Accident: కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్కూటర్‌పై వస్తున్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారును బలంగా ఢీకొట్టారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాము అనే యువకుడు మృతి చెందాడు. ఉలిగేష్‌ అనే అతను మెరుగైన చికిత్స కోసం బళ్లారి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. యువకులు హొళగుంద మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతితో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. అతి వేగంగా బైక్ నడపటం వలన.. చక్రం విరిగిందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details