ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 30, 2021, 12:20 PM IST

ETV Bharat / state

Accident: ఆదోని మండలంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని... కారు ఢీకొట్టిన ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ సైతం స్వల్పంగా గాయపడ్డాడు. వీరిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కోసం కర్నూలుకు తరలించారు.

ఆదోనిలో రోడ్డు ప్రమాదం
ఆదోనిలో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి క్రాస్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దకడబూరు మండలం చిన్న కడబూరుకు చెందిన యల్లయ్య, వీరాంజనేయులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో గాయపడ్డారు.

కారు డ్రైవరు సైతం గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిని ఆదోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. యల్లయ్య, వీరాంజనేయులను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details