ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి - తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి తాజా వార్తలు

తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా రాంపురంలో చోటు చేసుకుంది. మంత్రాలయంలో ఓ వివాహానికి హాజరైన యువకులు 8 మంది స్నేహితులతో కలిసి నదిలో ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అందరూ గల్లంతయ్యారు. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ళు ఆరుగురిని కాపాడగా.. ఇద్దరు మృతి చెందారు.

Two died while swimming in Tungabhadra river
తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

By

Published : Apr 6, 2021, 9:49 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మిగనూరుకు చెందిన మహబూబ్ బాషా, నెల్లూరుకు చెందిన వస్తాద్ స్నేహితులతో కలిసి మంత్రాలయంలో వివాహానికి హజరయ్యారు. అనంతరం 8 మంది స్నేహితులతో కలిసి సరదాగా తుంగభద్ర నదిలో ఈతకు వెళ్ళారు.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అందరూ గల్లంతయ్యారు. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ళు వారిని గమనించి వెంటనే స్పందించారు. ఆరుగురిని కాపాడగా.. మహబూబ్, వస్తాద్ నీటి ప్రవాహంలో గల్లంతై.. మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షల నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details