ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Two Constables Died: వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. విధుల్లోనే ప్రాణాలొదిలిన ఇద్దరు కానిస్టేబుళ్లు - రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్

Two Constables Died In Road Accidents: ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు కానిస్టేబుళ్లు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడిచారు. అందులో ఒకరు కర్నూలు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ అన్వర్ భాషా..విశాఖ జిల్లాలో గవిరెడ్డి దేముడు మృతి చెందారు.

Two Constables Died
Two Constables Died

By

Published : May 12, 2023, 10:51 PM IST

Two Constables Died In Road Accidents: ప్రజల భద్రతలో వాళ్లు నిత్యం విధులు నిర్వహిస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు తమ ప్రాణాలు సైతం విడుస్తుంటారు. అలాంటి ఘటనలే రాష్ట్రంలో జరిగాయి. ఆయా ప్రమాదాల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు విడిచారు. ఒక ప్రమాదం కర్నూలు జిల్లాలో జరగగా.. మరొకటి విశాఖ జిల్లాలో జరిగింది.

మద్యం తరలిస్తున్నవారిని పట్టుకుంటుండగా : కర్నూలు సమీపంలోని పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్సై జిలాని భాషా, కానిస్టేబుల్ అన్వర్ భాషాకు ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు మద్యం తీసుకొని వస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో వారు అప్రమత్తమై పంచలింగాల చెక్ పోస్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. వారు ద్విచక్ర వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లారు. దీంతో వారిని పట్టుకునేందుకు ఎస్సై జిలాని భాషా, కానిస్టేబుల్ అన్వర్ భాషాలు ద్విచక్రవాహనంపై వారిని వెెంబడించే క్రమంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి. ఈ ఘటనలో కానిస్టేబుల్ అన్వర్ భాషా అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. గాయాలైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని.. అలాగే జరిగిన దానిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని తాలూకా సీఐ రామలింగయ్య తెలిపారు.

సీఐ రామలింగయ్య

వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి:విశాఖ జిల్లా పెందుర్తి ఆనందపురం రహదారి దుక్కవానిపాలెం టోల్ గేటు వద్ద ఆగి ఉన్న కారును టాటా ఏసీ వాహనం ఢీకొని గవిరెడ్డి దేముడు(47) అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ఆధారంగా.. అనకాపల్లి జిల్లా గొలుగొండ పోలీస్ స్టేషన్​లో గవిరెడ్డి దేముడు కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా పెందుర్తి ఆనందపురం రహదారి మీదుగా విశాఖ కోర్టుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో దుక్కవానిపాలెం టోల్ వద్ద కారు డోర్ తీసి ఎక్కెందుకు ప్రయత్నిస్తుండగా వెనుక నుంచి వస్తున్న టాటా ఏసీ వాహనం అతివేగంతో ఢీకొంది. దీంతో సంఘటనా స్థలంలోనే హెడ్ కానిస్టేబుల్ దేముడు తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడే మృతి చెందాడు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆనందపురం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్​లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు దేవుడుకు భార్యతో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details