తుంగభద్ర పుష్కరఘాట్ల ఏర్పాట్లను వైకాపా నేత, అఖిల భారత గంగపుత్ర బెస్త మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనిల్ కుమార్ బెస్త సందర్శించారు. ఈ నెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. నీటి ప్రవాహంపై పూర్తిగా అవగాహన ఉన్న గజ ఈతగాళ్లను వెంటబెట్టుకుని తీరంలో నీటి లోతును అంచనా వేశారు. పుష్కరాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అనిల్ తెలిపారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం...