ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 10:04 AM IST

ETV Bharat / state

పుష్కర స్నానం.. కార్తీక దీపం: వెల్లువెత్తిన భక్తజనం

తుంగభద్ర పుష్కరాల సందర్బంగా నదీ స్నానాలకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. అధికారులు ఘాట్ల వద్ద అనుమతివ్వక పోవడంతో సమీప గ్రామాల పరిధిలోని నదీ తీరానికి వెళ్లి ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఆ తర్వాత తాము కొలిచే పుణ్యక్షేత్రాలకు వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. కార్తీక సోమవారం వద్ద సంకల్​బాగ్ ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది.

తుంగభద్ర తీరాన కార్తీక సందడి
తుంగభద్ర తీరాన కార్తీక సందడి

తుంగభద్ర తీరాన కార్తీక సందడి

సోమవారం తెల్లవారుజాము నుంచి తుంగభద్ర నది మెరిసింది. కర్నూలు జిల్లాలో తంగభద్ర పుష్కరాలు నాలుగవ రోజు కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో.. సంకల్​భాగ్ ఘాట్ వద్ద భక్తుల సందడి ఎక్కువగా ఉంది. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి.. నదిలో దీపాలు వదిలారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు పుష్కరాల్లో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించే విధంగా నియమాలను పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details