ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

water disputes: నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తి నిలిపివేసిన తెలంగాణ జెన్‌కో - నాగార్జున సాగర్​ వద్ద తెలంగాణ విద్యుదుత్పత్తి

నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది. తెలంగాణ జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుదుత్పత్తి నిలిపివేశారు. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్‌లో తెలంగాణ జెన్‌కో జల విద్యుదుత్పత్తి చేసింది. 11 రోజుల్లో 30 మిలియన్ల యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది.

ts genco stopped power production at nagarjuna sagar
ts genco stopped power production at nagarjuna sagar

By

Published : Jul 10, 2021, 3:16 PM IST

నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుదుత్పత్తిని ఆపివేశారు. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 11 రోజుల్లో 30 మిలియన్ల యూనిట్ల కరెంట్‌ను జెన్‌కో ఉత్పత్తి చేసింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది. ప్రాజెక్టుల్లో నీళ్లు తక్కువగా ఉన్నా తెలంగాణ జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.

నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని కృష్ణానదీ యాజమాన్య బోర్టుతో పాటు కేంద్ర జలశక్తి శాఖలకు ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. విద్యుత్‌ ఉత్పత్తి నిబంధనల మేరకే చేస్తున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. తమకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటున్నామని తేల్చిచెప్పింది. శ్రీశైలంలో గరిష్ఠ మట్టాలకు నీరు చేరకూడదనే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందనేది ఆంధ్రప్రదేశ్‌ వాదిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం సహా కృష్ణా జలాల కేటాయింపుపై ఈనెల 24న కృష్ణానదీ యాజమాన్య బోర్టు పూర్తి స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ

ABOUT THE AUTHOR

...view details