ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టాలు తప్పిన రైలింజిన్‌.. రైళ్ల రాకపోకల ఆలస్యం - కర్నూలు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

కర్నూలు నగర పరిధిలోని కేసీ కాల్వ వద్ద కాచిగూడ నుంచి డోన్ వెళ్తున్న లోకోమోటివ్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఇంజిన్ నెమ్మదిగా వెళ్తుండడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

train track missing near karnulu district
train track missing near karnulu district

By

Published : Jun 26, 2021, 6:56 AM IST

కాచిగూడ నుంచి డోన్‌కు వెళ్తున్న లోకోమోటివ్‌ రైలు ఇంజిన్‌ శుక్రవారం రాత్రి పట్టాలు తప్పింది. కర్నూలు నగర పరిధిలోని కేసీ కాల్వ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఇంజిన్‌ నెమ్మదిగా వెళ్తున్న వేళ ప్రమాదం జరగడంతో పెద్ద ముప్పు తప్పింది. ఘటనకుగల కారణాలను హైదరాబాద్‌ డివిజినల్‌ మేనేజర్‌తో కూడిన నిపుణుల బృందం అన్వేషించాలని అధికారులు చెప్పారు.

ఆ తర్వాతే రైళ్ల రాకపోకలను అనుమతించాల్సి ఉన్న కారణంగా.. కొన్ని రైళ్లు ఆలస్యంగా తిరగనున్నాయని కర్నూలు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు హైదరాబాద్‌ డివిజన్‌ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో కాచిగూడ నుంచి వెళ్లే చెన్నై ఎగ్మోర్‌, గుంటూరు రైళ్లను గద్వాల స్టేషన్‌లో నిలిపివేశారు. డోన్‌ మీదుగా వెళ్లే కాచిగూడ రైలు సైతం ఆలస్యంగా నడిచింది.

ABOUT THE AUTHOR

...view details