ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు- ప్రకాశం సరిహద్దులో రైలు ఢీ.. పులి మృతి

రైలు ఢీకొని పెద్దపులి మృతి చెందింది. కర్నూలు ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఈ ఘటన జరిగింది.

By

Published : Apr 17, 2019, 9:07 AM IST

Updated : Apr 17, 2019, 3:23 PM IST

tiger

కర్నూలు- ప్రకాశం సరిహద్దులో రైలు ఢీ.. పులి మృతి

కర్నూలు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో పెద్ద పులి ప్రమాదవశాత్తూ మృత్యువాతపడింది. దిగువమెట్ట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా వాస్కోడిగామా నుంచి హౌరా వెళ్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టిన ఘటనలో పలి చనిపోయింది. రైలు డ్రైవరు... నంద్యాల రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. గత ఏడాది చివరలో చిరుతపులి, ఇప్పుడు పెద్దపులి ఇదే తీరులో మృత్యువాత పడడంపై.. జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి వయస్సు 4 సంవత్సరాలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Last Updated : Apr 17, 2019, 3:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details