కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం ఒక్కరోజే 22 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 115కి చేరింది. బుధవారం 158 మందికి సంబంధించిన హెల్త్ నివేదికలు రాగా 136 మందికి నెగెటివ్ వచ్చింది. కొత్తగా 22 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది.
ఒక్కరోజులోనే 22 కరోనా పాజిటివ్ కేసులు - నేడు కర్నూలులో కరోనా పాటివ్ కేసులు
కర్నూలు జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే 22 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు కేసుల సంఖ్య 115కి చేరింది.
![ఒక్కరోజులోనే 22 కరోనా పాజిటివ్ కేసులు today 22 corona positive cases in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6808669-776-6808669-1586974507170.jpg)
today 22 corona positive cases in kurnool district