కర్నూలు, మంత్రాలయంలో మూడో రోజు తుంగభద్ర పుష్కరాలు కొనసాగుతున్నాయి. కొన్ని ఘాట్లలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. కరోనా నేపథ్యంలో పుష్కరాలకు వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల భక్తులు భౌతిక దూరం సహా కరోనా నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
మూడో రోజు కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు - మూడో రోజు కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు
తుంగభద్ర పుష్కరాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఘాట్ల వద్ద జల్లు స్నానాలు చేస్తున్నారు. కొన్ని ఘాట్ల వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
![మూడో రోజు కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు పుష్కరాలకు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న వైద్య సిబ్బంది](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9626020-28-9626020-1606040286950.jpg)
పుష్కరాలకు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న వైద్య సిబ్బంది