ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - కర్నూలులో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్ వార్తలు

కర్నూలులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు వారణాసి ఆనంద్ కుమార్ నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

thief arrested
thief arrested

By

Published : May 21, 2021, 8:39 PM IST

కర్నూలు నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న వారణాసి ఆనంద్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో కొన్ని రోజులుగా పలు కాలనీల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండగా.. వాటిలో 3 కేసుల్లో ఆనంద్ కుమార్ నిందితుడుగా ఉన్నాడని డీఎస్పీ మహేష్ తెలిపారు. మూడు కేసులకు సంబంధించి 2కేజీల వెండి ఆభరణాలు, కొంత బంగారం, రూ.లక్షా 25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details