ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 18, 2021, 7:23 AM IST

ETV Bharat / state

తాళం వేసిన ఇళ్లను లూటీ చేసే దొంగ అరెస్ట్

కర్నూలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని విశాఖపట్నానికి చెందిన పాత నేరస్థుడు వారణాసి అనంతకుమార్​గా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో 40 పైన కేసులున్నట్లు తెలిపారు.

Thief arrested in kurnool district
Thief arrested in kurnool district

కర్నూలులో పగటి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడిని విశాఖపట్నానికి చెందిన పాత నేరస్థుడు వారణాసి అనంత కుమార్​గా గుర్తించారు. కర్నూలులో 15 రోజుల్లో దాదాపు 10 ఇళ్ల దొంగతనాలు జరిగాయని పోలీసులు తెలిపారు.

నగరంలోని ఎన్ఆర్​పేటలో ఓ అపార్ట్​మెంట్లో చోరీకి పాల్పడిన తర్వాత అనంతకుమార్​ను పట్టుకున్నామన్నారు. కర్నూలులో 3 చోరీలు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో అతడిపై 40కి పైనే కేసులున్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details