ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు - ap capital news

కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డిలు నగరంలోని వైఎస్​ఆర్ కూడలి వద్ద ఒకేసారి రావటంతో అనుచరులు వారికి అనూకూలంగా నినాదాలు చేశారు.

వైకాపా నాయకులు సంబరాలు
వైకాపా నాయకులు సంబరాలు

By

Published : Aug 2, 2020, 7:56 PM IST

వైకాపా నాయకులు సంబరాలు

కర్నూలులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు మరోసారి భయటపడింది. కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నగరంలో వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్​ఆర్​ కూడలి వద్దకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తన అనుచరులతో రాగా అదే సమయానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తన అనుచరులతో అక్కడికి వచ్చారు. ఎన్నికల అనంతరం ఎస్వీ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్​ల మద్య వర్గపోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు నాయకులు ఒకే సమయంలో రావడంతో వారివారి అనుచరులు.. వారికి అనుకూలంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details