ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 2, 2020, 7:56 PM IST

ETV Bharat / state

కర్నూలులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు

కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డిలు నగరంలోని వైఎస్​ఆర్ కూడలి వద్ద ఒకేసారి రావటంతో అనుచరులు వారికి అనూకూలంగా నినాదాలు చేశారు.

వైకాపా నాయకులు సంబరాలు
వైకాపా నాయకులు సంబరాలు

వైకాపా నాయకులు సంబరాలు

కర్నూలులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు మరోసారి భయటపడింది. కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నగరంలో వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్​ఆర్​ కూడలి వద్దకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తన అనుచరులతో రాగా అదే సమయానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తన అనుచరులతో అక్కడికి వచ్చారు. ఎన్నికల అనంతరం ఎస్వీ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్​ల మద్య వర్గపోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు నాయకులు ఒకే సమయంలో రావడంతో వారివారి అనుచరులు.. వారికి అనుకూలంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details