ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 24, 2020, 10:11 AM IST

ETV Bharat / state

ఐదో రోజుకు తుంగభద్ర పుష్కరాలు...పెద్దగా హాజరుకాని భక్తులు

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు ఐదో రోజుకు చేరాయి. కొవిడ్ కారణంగా...పుష్కరస్నానం చేసేందుకు భక్తులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు.

The Tungabhadra Pushkars have reached the fifth day in Kurnool district.
ఐదో రోజుకు తుంగభద్ర పుష్కరాలు


తుంగభద్ర నది పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. నగరంలోని ప్రధాన పుష్కర ఘాట్ సంకల్ భాగ్​లో ఉదయం స్నానాలు చేసేందుకు భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. నదిలో స్నానం చేసి పుజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో... పుష్కర స్నానాలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చుపడం లేదు.

తుంగభద్ర నదిలో నీటి మట్టం మంగళవారం పెరిగింది. గత నాలుగు రోజులుగా భక్తులు నదిలో దీపాలు వెలిగించి వదిలేందుకు కూడా నీరు ఉండేది కాదు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుంగభద్ర అధికారులు నదికి నీరు వదలడంతో....జలకళ సంతరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details