ఏపీ మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్ఆర్సీలు, లోకాయుక్తలు హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఉంటాయని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 5 వారాలకు వాయిదా వేసింది.
హెచ్ఆర్సీ, లోకాయుక్తలను కర్నూలులో ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది గత విచారణలో ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు గత విచారణలో తెలిపారు. తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ధర్మాసనానికి తెలిపారు. కర్నూలులో ఇప్పటికే లోకాయుక్త కార్యాలయన్ని ప్రారంభించామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ విభజన చట్ట నిబంధనలకు విరుద్ధం