కర్నూలులో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుబుంబ సభ్యులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకుల జోక్యం వల్లే పోలీసులు.. అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురి చేశారని ఆరోపించారు.
అబ్దుల్ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని తెదేపా నిరసన - కర్నూలులో నిరసన చేపట్టిన తెదేపా
నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తెదేపా నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే పోలీసులు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
కర్నూలులో నిరసన చేపట్టిన తెదేపా
పోలీసులు, ఉన్నతాధికారులు... అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి పనులు చేస్తే ఇబ్బందులకు గురవుతారని కర్నూలు పార్లమెంట్ తెదేపా ఆధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కోరారు.
ఇదీచదవండి