ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"తుంగభద్ర పుష్కరాల్లో పుణ్యస్నానాలు నిషేధించడం దారుణం" - తుంగభద్ర పుష్కరాలు

కరోనా పేరుతో తుంగభద్ర పుష్కరాల్లో పుణ్యస్నానాలను నిషేధించడం దారుణమని తెదేపా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు
మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

By

Published : Nov 10, 2020, 3:45 PM IST

తుంగభద్ర పుష్కరాల్లో పుణ్యస్నానాలను నిషేధించటంపై తెదేపా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పుష్కరాల కోసం నిధులు కేటాయించారని, పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సర్కారు వ్యవహరిస్తోందని ఈ నిర్ణయంపై పునఃసమీక్షించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details