ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలి' - తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు వార్తలు

న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తెదేపా నేత సోమిశెట్టి రవీంద్రబాబు కోరారు. ఈ మేరకు కర్నూలులోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

somisetty venkateswarlu
somisetty venkateswarlu

By

Published : Aug 6, 2020, 4:12 PM IST

వైకాపా ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు... న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను అవమానపరిచే విధంగా మాట్లాడారని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఆయనను వెంటనే అరెస్టు చేసి, చట్టపరంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

న్యాయమూర్తులనే ఇలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో న్యాయం ఎక్కడుందని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details