కర్నూలు జిల్లా గోవిందపల్లె గ్రామానికి చెందిన ఓ తెదేపా నేతను హత్య చేసేందుకు కొందరు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇవాళ గోవిందపల్లి గ్రామంలో ఓ స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా తిరగడాన్ని గమనించిన తెదేపా నేత.. సిరివెళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా నల్లమల అటవీ ప్రాంతం వైపు వెళ్లింది. పోలీసులు వెంబటించడంతో మండల పరిధిలోని మిట్టపల్లె వద్ద నల్లమల అటవీ ప్రాంతంలో వాహనాన్ని వదిలి దుండగులు పారిపోయారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో స్టిక్కర్ ఉండటం స్థానికంగా కలకలం రేపుతుంది.
అయితే ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. డీఎస్పీ రాజేంద్ర ఈ ఘటనపై స్పందించిందుకు నిరాకరించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న మాట్లాడుతామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను ఆళ్లగడ్డ పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.