ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య - అప్పుల బాధ భరించలేక కర్నూలు జిల్లాలో యువరైతు ఆత్మహత్య

అప్పుల బాధ తట్టుకోలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురంలో జరిగింది.

Suicide is unbearable
అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య

By

Published : Dec 31, 2019, 5:27 PM IST

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురంలో అప్పుల బాధ భరించలేక విజయ్ కుమార్ అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్దిలేటి, శివమ్మలకు కుమారుడు విజయ్ కుమార్, కుమార్తె నాగలక్ష్మి సంతానం. విజయ్ కుమార్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి ఆసరాగా ఉంటున్నాడు. మూడు సంవత్సరాల కిందట వారికి ఎనిమిది ఎకరాల పొలం ఉండేది. అప్పులు పెరగడంతో ఐదు ఎకరాలు అమ్ముకున్నారు. గత రెండేళ్లుగా తమకున్న మూడు ఎకరాల పొలంతో పాటు కౌలుకు తీసుకొని పత్తి జొన్న పంటలను సాగు చేశారు. పకృతి ప్రతాపంతో పంట దిగుబడి రాక అప్పులు పెరిగిపోయాయి.

అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య
అప్పులు పెరిగిపోవడంతో నిత్యం మనోవేదనకు గురైన విజయ్ కుమార్ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు ఆరా తీశారు. పురుగుల మందు తాగినట్లు చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులు విజయ్ కుమార్ చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ... సోమవారం వేకువజామున మృతిచెందాడు. కుమారుడు కళ్ళముందే ప్రాణాలు వదలటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యువరైతు విజయకుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details