ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చదువు కోసం.. గోడ దూకాల్సిందే! - కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని పౌల్ట్రీ ప్రాథమిక పాఠశాలకు రహదారి సమస్య

ఆ పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రహరీ దూకి వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని పౌల్ట్రీ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఈ పరిస్థితి.. విద్యార్థులతో పాటు సిబ్బందికీ ఇబ్బందిగా మారింది.

students go to school should be  jumped into a wall in karnool district  atamakuru
'దారి' లేని ప్రాథమిక పాఠశాల

By

Published : Feb 18, 2020, 9:42 AM IST

Updated : Feb 18, 2020, 12:46 PM IST

'దారి' లేని ప్రాథమిక పాఠశాల

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని పౌల్ట్రీ ప్రాథమిక పాఠశాలకు.. దారి లేక ఇబ్బందిగా మారింది. ఈ బడికి వెళ్లాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రహరీ దూకాల్సిందే. 2004లో నిర్మించిన పాఠశాలకు తూర్పు, ఉత్తర దిశ వైపు రాకపోకలకు రహదారులు ఉండేవి. పాఠశాలకు స్థలం దానం చేసిన దాత తూర్పువైపున ఉన్న తన స్థలాన్ని ఇతరులకు విక్రయించగా.. స్థలం కొన్న వ్యక్తి తూర్పు వైపు రహదారిని మూసివేశారు. ఉత్తరం వైపున ఉన్న రహదారిని రైతులు మూసివేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Last Updated : Feb 18, 2020, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details