ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 12, 2021, 5:06 PM IST

ETV Bharat / state

మహానందిలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

మహాశివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. ఎమ్మెల్యే కొద్దీ దూరం ఎద్దులను పరిగెత్తించి రైతుల్లో ఉత్సాహం నింపారు.

state level bull race competitions at mahanadi
మహానందిలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

కర్నూలు జిల్లా మహానందిలో రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. కొద్దీ దూరం ఎద్దులను పరుగెత్తించి రైతుల్లో ఉత్సాహం నింపారు. పలు జిల్లాల నుంచి పశు పోషకులు బల ప్రదర్శన పోటీలో తమ ఎద్దులను దింపారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి వేలాదిగా రైతులు తరలివచ్చారు.

మహానందిలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

ABOUT THE AUTHOR

...view details