ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి అనిల్​కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత - srisailam flood victims

కర్నూలు జిల్లా నందికొట్కూరులో మంత్రి అనిల్ కుమార్​ కాన్వాయ్ ను ప్రజలు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని శ్రీశైలం ముంపు బాధితులు వేడుకున్నారు.

మంత్రి అనిల్​కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత

By

Published : Nov 7, 2019, 2:28 PM IST

మంత్రి అనిల్​కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత

కర్నూలు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నిరసన సెగ తగిలింది. శ్రీశైలం నుంచి కర్నూలు వస్తున్న ఆయన్ను నందికొట్కూరులో బాధితులు అడ్డుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 60 రోజులుగా దీక్షలు చేస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం సమర్పించారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ భూములు ఇచ్చామని... 40 ఏళ్లుగా ప్రభుత్వాలు న్యాయం చేయటం లేదని ఆవేదన చెందారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details