గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని స్మరించుకుంటూ...ఆయన పేరుతో కర్నూలు జిల్లా నంద్యాలలో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. హిందూ శ్మశాన వాటికను ఆధునిక వసతులతో నిర్మించే ప్రక్రియ కొనసాగుతోంది. దాతల సహకారంతో నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. అందులో భాగంగా 400 చెట్లు నాటడంతో పాటు ప్రతి చెట్టు వద్ద...ఎస్పీబీ పాటలను సూచికగా పెట్టనున్నట్లు నవనిర్మాణ సమితి సభ్యులు తెలిపారు.
నంద్యాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో స్మృతి వనం - నంద్యాల తాజా వార్తలు
గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకాలను నెమరు వేసుకొనే క్రమంలో ఆయన పేరుతో నంద్యాలలో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నవనిర్మాణ సమితి శ్రీకారం చుట్టింది
![నంద్యాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో స్మృతి వనం నంద్యాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో స్మృతి వనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9544402-569-9544402-1605354055616.jpg)
నంద్యాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో స్మృతి వనం
నంద్యాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో స్మృతి వనం