ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇసుక సరఫరా విధానాన్ని సులభతరం చేయాలి' - karnool political news

ఇసుక సరఫరా విధానాన్ని సులభతరం చేయాలని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఇసుక కొరతతో ప్రజలు సమస్యలెదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఎన్నికైన నంద్యాల మాజీమంత్రి ఎన్. ఎమ్. డి. ఫరూక్ ను సోమిశెట్టి అభినందించారు.

somisetty venkateswarulu on sand scheme
ఫరూక్ ను అభినందిస్తున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

By

Published : Oct 22, 2020, 9:12 PM IST

సీఎం జగన్ ప్రతీకార ధోరణి వీడి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హితవు పలికారు. ఇసుక సరఫరా విధానాన్ని సులభతరం చేయాలని కోరారు.

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఎన్నికైన నంద్యాల తెదేపా నాయకుడు, మాజీమంత్రి ఎన్. ఎమ్. డి. ఫరూక్ ను సోమిశెట్టి అభినందించారు. అందరూ కలిసి పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఫరూక్ అన్నారు.

ఇదీ చదవండి:'శంకుస్థాపన చేసిన తర్వాత మూడున్నరేళ్లు ఏం చేశారు'

ABOUT THE AUTHOR

...view details