ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది: సోమిశెట్టి - సోమిశెట్టి న్యూస్

పోలీసులు, అధికారులు, వైకాపా నాయకులు తెదేపా బలపరిచిన అభ్యర్థులను బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. రానున్న పురపాలిక ఎన్నికల్లో తెదేపా విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది
వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది

By

Published : Feb 22, 2021, 8:55 PM IST

వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని..తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసులు, అధికారులు, వైకాపా నాయకులు తెదేపా బలపరిచిన అభ్యర్థులను బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో ఓడించాలని శతవిధాలా ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గమైన ఆలూరు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్​లో తెదేపా మద్దతుదారులు విజయం సాధించారని గుర్తు చేశారు. రానున్న పురపాలిక ఎన్నికల్లో తెదేపా విజయం సాధించటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details