తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం ద్వారా... వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లవుతుందని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. తమ అభ్యర్థికి 5 లక్షల మెజారిటీ వస్తుందని చెబుతున్న అధికార పార్టీ... మంత్రులు, ఎంపీలను ఇన్ఛార్జులుగా ఎందుకు నియమించిందని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో... డబ్బు, మద్యం ఏరులై పారుతోందని... ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
'తెదేపాకు ఓటు వేసి... అధికార పార్టీకి బుద్ధి చెప్పండి' - సోమిరెడ్డి వెంకటేశ్వర్లు వార్తలు
తిరుపతి ఉపఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయాలని తెదేపా నేత సోమిరెడ్డి వెంకటేశ్వర్లు.. ప్రజలను కోరారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
సోమిరెడ్డి వెంకటేశ్వర్లు