ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 1, 2020, 6:25 AM IST

ETV Bharat / state

తెలంగాణ నుంచి తరలిస్తున్న 106 సీసాల మద్యం పట్టివేత

రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటంతో అక్రమార్కులు నూతన విధానానికి తెర లేపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ.. జేబులు నింపుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా బేతంచర్లలో తెలంగాణ రాష్ట్రం నుంచి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Seizure of 106 bottles of liquor moving from Telangana in bwthamcharla kurnool district
తెలంగాణ నుంచి తరలిస్తున్న 106 సీసాల మద్యం పట్టివేత

కర్నూలు జిల్లా బేతంచర్లలోని కనుమ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి నాపరాళ్ల ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్న 106 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details