ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 19, 2022, 2:48 PM IST

ETV Bharat / state

శ్రీశైలమహాక్షేత్రంలో వైభవంగా ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు...

Sankranti celebrations at Srisailam: శ్రీశైలమహాక్షేత్రంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు... ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పార్వతి సమేత మల్లికార్జున స్వామి అశ్వవాహన సేవపై రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చారు.

Sankranti celebrations at Srisailam
Sankranti celebrations at Srisailam

Sankranti celebrations at Srisailam: శ్రీశైలమహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో... శ్రీ పార్వతి సమేత మల్లికార్జున స్వామికి అశ్వవాహన సేవ జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు మంత్రోచ్ఛారణలతో విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు రమణీయంగా పుష్పోత్సవం, శయనోత్సవం జరిపి ఉత్సవాలకు ముగింపు పలికారు.

శ్రీశైలమహాక్షేత్రంలో వైభవంగా ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు...

ABOUT THE AUTHOR

...view details