కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ డిపొలో అప్రెంటిస్గా విధులు నిర్వర్తిస్తున్న సిసింద్రీ గౌడ్.. విద్యుదాఘాతంతో మృతి చెందాడు. డిపో గ్యారేజీలో ఉన్న బస్సులో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా అవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిసింద్రీ గౌడ్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో ఆర్టీసీ ఉద్యోగి మృతి - కోవెలకుంట్ల నేర వార్తలు
కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో విషాదం నెలకొంది. ఆర్టీసీ డిపోలో అప్రెంటిస్గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి విద్యుదాఘాతంతో మృతి చెందారు.
![విద్యుదాఘాతంతో ఆర్టీసీ ఉద్యోగి మృతి RTC employee death by electrocution in kovelakuntla kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7461294-134-7461294-1591185852621.jpg)
విద్యుదాఘాతంతో ఆర్టీసీ ఉద్యోగి మృతి