ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ కిందపడి ద్విచక్ర వాహనదారుడు మృతి

బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఓవర్ టేక్ చేయబోయి... ప్రమాదవశాత్తు ఆ వాహనం కింద పడి ఒకరు చనిపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల టెక్కెే రహదారిపై జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Jul 31, 2020, 11:01 PM IST

లారీ కిందపడి ద్విచక్రవాహనదారుడు మృతి.. మరోకరికి గాయాలు
లారీ కిందపడి ద్విచక్రవాహనదారుడు మృతి.. మరోకరికి గాయాలు

లారీ కిందపడి ద్విచక్రవాహనదారుడు మృతి.. మరోకరికి గాయాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కే రహదారిపై లారీ బైక్​ను ఢీకొని ఒకరు మృతి చెందారు. ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ టైర్ కింద పడి నంద్యాల పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 15 ఏళ్ల శ్రీహర్ష చనిపోయాడు. శిల్పానగర్​కు చెందిన రాజు గౌడ్ అనే యువకుడికి గాయాలయ్యాయి. వీరిద్దరు కలిసి బైక్​పై వెళ్తుండగా ముందు వెళ్ళే లారీని దాటే ప్రయత్నం చేయటంతో ఈ ఘటన జరిగింది. నంద్యాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details