ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది.. త్వరగా పరిష్కరించండి'

కర్నూలు జిల్లా నంద్యాలలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం అందించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని... వెంటనే స్పందించి ఉపాధ్యాయులకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.

By

Published : Jun 30, 2021, 11:27 AM IST

mlc on teachers problems
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు​ వినతి పత్రం అందజేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

కర్నూలు జిల్లా నంద్యాలలో ఉపాధ్యాయుల సమస్యలు తొందరగా పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి.. ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి వెళ్లి నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణకు ఆయన వినతిపత్రం అందజేశారు.

సమస్యల పరిష్కార పక్రియలో జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ విషయమై వెంటనే స్పందించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు చంద్రశేఖర్, నాగేంద్ర కుమార్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details