ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 3, 2020, 8:03 AM IST

ETV Bharat / state

సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు 14 రోజుల రిమాండ్.. కర్నూలు జైలుకు తరలింపు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ. సోమశేఖర రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లకు నంద్యాల న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కర్నూలు జైలుకు వారిని పోలీసులు తరలించారు.

Remanded  police in Abdul Salam case
అబ్దుల్ సలాం కేసులో పోలీసులకు రిమాండ్

అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసులో కర్నూలు జిల్లా నంద్యాల కోర్టుకు హాజరైన సీఐ. సోమశేఖర రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వారిని కర్నూలు జైలుకు తరలించారు. నవంబర్ 3వతేదీన కుటుంబ సభ్యులతో కలిసి పాణ్యం మండలం కౌలూరు సమీపాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలో నిముసాంబిక జువెల్లర్స్​లో నమ్మకంగా పనిచేసే సలాంకు ఆ దుకాణంలో గత ఏడాది జరిగిన మూడున్నర కిలోల బంగారు చోరీలో ప్రమేయం ఉందని పోలీసులు అరెస్టు చేశారు. కొంత బంగారంను ఆతని నుంచి రికవరీ చేశారు. ఆ కేసులో బయటకు వచ్చిన సలాం ఆటో డ్రైవర్​గా కొనసాగుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో సలాం ఆటోలో ఓ ప్రయాణికుడి జేబులో నుంచి దొంగలు డబ్బు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ పోలీసులు ఆటో డ్రైవర్ సలాంను పిలిచి ప్రశ్నించారు.

ఈ విషయంలో పోలీసులు ఇబ్బందులకు గురిచేశారని మనస్థాపానికి గురై సలాం.. భార్య ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కేసుల్లో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆత్మహత్యకు ముందు సలాం తీసిన సెల్ఫీ వీడియో నవంబర్ 5వ తేదీన బయటకు వచ్చింది. సీఐ. సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లు వేధించారని సలాం వాపోయారు. ఈ సంఘటన పై స్పందించిన ప్రభుత్వం... ఐజీ. నేతృత్వంలో విచారణ జరిపి సీఐ. హెడ్ కానిస్టేబుల్​ను నవంబర్ 8న అరెస్టు చేశారు. నవంబర్ 9 న వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ముస్లిం ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. సీఐ.సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు మూడో ఆదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు పలు మార్లు వాయిదా వేసింది. వారి బెయిల్ రద్దు చేస్తూ.. డిసెంబరు రెండో తేదీ సాయంత్రం లోపు కోర్టులో లొంగిపోవాలని నవంబర్ 29 వతేది కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరూ ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. వీరికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది.

ఇదీ చూడండి:

మత్తు ఉచ్చులో విద్యార్థులు...కిక్కు కోసం బానిసలు..

ABOUT THE AUTHOR

...view details