ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్థిక వివాదం: వ్యక్తిపై బంధువుల దాడి - గంగుల ప్రహ్లద్ రెడ్డిపై బంధువుల దాడి తాజా వార్తలు

కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో గంగుల ప్రహ్లాదరెడ్డి అనే వ్యక్తిపై అతని బంధువులు దాడి చేశారు. డబ్బుల విషయంలో ఈ వివాదం వచ్చినట్టు బాధితుడు తెలిపాడు.

డబ్బుల విషయంలో వ్యక్తిపై బంధువుల దాడి
డబ్బుల విషయంలో వ్యక్తిపై బంధువుల దాడి

By

Published : Oct 11, 2020, 5:48 PM IST

ఎన్జీవో కాలనీలోని తన గదిలో ఉన్న ప్రహ్లాద్​ రెడ్డిని.. అతడి బంధువులు బయటకు పిలిచారు. కర్రలతో, ఇటుకలతో దాడి చేసి గాయపరిచారు. బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తనకు ఇవ్వాల్సిన డబ్బును అడిగినందుకు దాడి చేశారని ప్రహ్లాద్ రెడ్డి ఆరోపించాడు. ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పిలుస్తున్నాడంటూ వచ్చి తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణ చేపట్టారు.

పోలీసుల ఆరా

ABOUT THE AUTHOR

...view details