ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లా ఆలయాల్లో ఘనంగా రథోత్సవాలు - కర్నూలు జిల్లా ఆలయాల్లో వైభవోపేతంగా రథోత్సవాలు

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రథోత్సవం, తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మధ్య సంప్రదాయబద్ధంగా వేడుకలు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై.. ఆయా కార్యక్రమాలను తిలకించారు.

rathotsavams in kurnool district
కర్నూలు జిల్లా ఆలయాల్లో ఘనంగా రథోత్సవాలు

By

Published : Mar 13, 2021, 10:32 PM IST

కర్నూలు జిల్లా ఆలయాల్లో ఘనంగా రథోత్సవాలు

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి ఆలయంలో.. ఉమామహేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పూజలు నిర్వహించిన అనంతరం.. రథం ముందుకు లాగి ఉత్సవం ప్రారంభించారు. ఈ నెల 10 న ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. వేదపండితుల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోలాటం మధ్య.. అలంకరించిన రథంలో ఉత్సవ విగ్రహాలకు భక్తులు పూజలు చేశారు.

డోన్​లోని కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో.. పార్వతీ పరమేశ్వర రథోత్సవం, తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివుడికి మూడు రోజులుగా ఆలయంలో పూజలు, అభిషేకాలు, జాగరణ, కళ్యాణం నిర్వహించారు.

పెద్దకడబూరులోని శ్రీసిద్ధారూఢ స్వామి మహా రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పూర్ణ కుంభంతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథంపైనున్న ఉత్సవ మూర్తికి కొబ్బరికాయ కొట్టేందుకు రెండు వర్గాలు తోసుకోగా.. పోలీసులు చెదరగొట్టారు. ఉత్సవం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఇదీ చదవండి:

మెల్లగా వచ్చిన వారికే.. బహుమతి!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details