కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి ఆలయంలో.. ఉమామహేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పూజలు నిర్వహించిన అనంతరం.. రథం ముందుకు లాగి ఉత్సవం ప్రారంభించారు. ఈ నెల 10 న ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. వేదపండితుల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోలాటం మధ్య.. అలంకరించిన రథంలో ఉత్సవ విగ్రహాలకు భక్తులు పూజలు చేశారు.
డోన్లోని కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో.. పార్వతీ పరమేశ్వర రథోత్సవం, తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివుడికి మూడు రోజులుగా ఆలయంలో పూజలు, అభిషేకాలు, జాగరణ, కళ్యాణం నిర్వహించారు.