ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో ఏర్పాటైన జిల్లా వనరుల కేంద్రం - కర్నూలులో రైతు భరోసా కేంద్రం

కర్నూలు జిల్లా నంద్యాలలో జిల్లా వనరుల కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలకు జిల్లా వనరుల కేంద్రం అనుసంధానంగా ఉంటుందని ప్రాజెక్టు డైరెక్టర్ ఉమామహేశ్వరి వెల్లడించారు. రైతులు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నంద్యాలలో ఏర్పాటైన జిల్లా వనరుల కేంద్రం

By

Published : Jun 6, 2020, 5:47 PM IST

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఇకపై రైతు భరోసా కేంద్రాల జిల్లా వనరుల కేంద్రం (డి. ఆర్. సి) పరిధిలోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాలలో జిల్లా వనరుల కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా వనరుల కేంద్రంలో ఇవాళ అధికారులు సమావేశమయ్యారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలకు జిల్లా వనరుల కేంద్రం అనుసంధానంగా ఉంటుందని ప్రాజెక్టు డైరెక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details