ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైద్య సిబ్బంది వాడిన పీపీఈ కిట్లు.. రోడ్ల పక్కన!

రాష్ట్రంలో కరోనా కోరలు చాచి విజృంభిస్తున్నా.. కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించేటప్పుడు వైద్యులు, ఇతర సిబ్బంది వాడే.. పీపీఈ కిట్లను రోడ్లు పక్కనే పడేస్తున్నారు. వీటి కారణంగా.. కరోనా మరింత వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Aug 12, 2020, 8:41 PM IST

Published : Aug 12, 2020, 8:41 PM IST

ppe kits
రోడ్ల పక్కనే పీపీఈ కిట్లు

వైద్య సిబ్బంది వాడిన పీపీఈ కిట్లు రోడ్ల పక్కన!

కర్నూలు జిల్లా నంద్యాలలో క్వారంటైన్​లలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది వాడిన పీపీఈ కిట్లును రోడ్ల పక్కన పడేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు నంద్యాల సమీపంలో ఎస్సార్బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​లో చికిత్స అందిస్తున్నారు.

అక్కడ సిబ్బంది వాడిన పీపీఈ కిట్లకు నిప్పు పెట్టకుండా.. రోడ్లపైనే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఈ కారణంగా.. రహదారిపై వెళ్తున్న వారు.. స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాడేసిన పీపీఈ కిట్లను ఇలా వదిలేస్తే కరోనా మరింత వ్యాపిస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details