కర్నూలు జిల్లా నంద్యాల సలింనగర్లో కొండచిలువ కలకలం రేపింది. దానిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సలింనగర్లోని గడ్డి భూముల్లో దాగివున్న కొండచిలువను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. రిస్క్ టీమ్, మొబైల్ పార్టీ బృందం కలిసి దానిని పట్టుకొని గొనె సంచిలో బంధించారు. పట్టుకున్న కొండచిలువను దూరంగా ఉండే అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా వదిలేస్తామని అధికారులు తెలిపారు. కొండ చిలువ దొరకడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Python: కొండచిలువను పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది - nandyal
రాత్రి సమయంలో కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఓ కొండచిలువ కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన అటవీశాఖ సిబ్బంది దానిని పట్టుకున్నారు.
Python