కర్నూలు జిల్లా అదోనిలో సైకో హల్చల్ చేశాడు. రహదారిపైన వెళ్తున్న ఇద్దరిపై రాళ్ళతో దాడి చేసి గాయపరిచాడు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి దగ్గర రాత్రి నుంచి సైకో వ్యక్తి.. ఆ ప్రధాన రహదారిపై వెళుతున్న వారిని పెద్ద రాళ్లతో కొట్టి దాడి చేస్తున్నాడు. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో కొంతమంది స్థానికులు అతడిని పట్టుకుని .. తాళ్లతో కళ్లు, చేతులు కట్టి పోలీసులకు అప్పగించారు.